ఇదే మా కథ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌

Published On: October 1, 2021   |   Posted By:
 
ఇదే మా కథ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌
 
 
ఇదే మా కథ సినిమా కచ్ఛితంగా సుమంత్ కి మంచి పేరు తెస్తుంది –  ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో  శ్రీకాంత్

సుమంత్‌ అశ్విన్‌, శ్రీకాంత్‌, భూమిక, తాన్య హోప్‌లు కలిసి నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. శ్రీమతి గుర్రప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద జీ మహేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు గురు పవన్‌ దర్శకుడు.
 
ఈ చిత్రం అక్టోబర్‌ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో ఎంఎస్ రాజు, బీ గోపాల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. శ్రీకాంత్, సుమంత్ అశ్విన్‌లు ఈవెంట్‌లో పాల్గొన్నారు.
 
 

దర్శకుడు గురు పవన్ మాట్లాడుతూ.. సినిమా గురించి, నటీనటుల గురించి చెప్పే ముందు.. నా గురించి చెప్పుకోవాలి. ఈ గురు ఎక్కడి నుంచి వచ్చారు అని తెలియాలి. ఎలాగైనా బతకాలి అని కోట్ల మంది అనుకుంటారు. నాకు నచ్చినట్టే బతకాలి అని అనుకునే వాళ్లు లక్షల్లో ఉంటారు. ఆ లక్షల్లో ఒక్కడిని నేను. వారంతా ఆర్మీ, పోలీస్, డాక్టర్లు అంటూ వివిధ రకాల వృత్తులను ఎంచుకుంటారు. ఎంటర్టైన్మెంట్ రంగానికి వచ్చే కొంత మందిలో నేను ఒక్కడిని. సక్సెస్ రేటు చాలా తక్కువ ఉంటుందని తెలిసి వచ్చిన వాడిలో నేను ఒక్కడిని. అలా వచ్చిన నేను దాదాపు 12 ఏళ్లు ఎన్నో కష్టాలు పడ్డాను అని నేను చెప్పను. ఆల్మోస్ట్ పదేళ్లలో ఎన్నో చిత్రాలకు కో డైరెక్టర్‌గా పని చేశాను. ఈ చిత్ర పరిశ్రమలో నేను ఎంతో లక్కీ ఫెలోని. నాకు ఇంత ఇచ్చిన పరిశ్రమకు ఏదైనా ఇవ్వాలని అనుకున్నాను. కానీ నాకు ఆ అవకాశం ఎలా వస్తుందని రకరకాలుగా ప్రయత్నించాను. ఆ సమయంలోనే నా నిర్మాత మహేష్ గారి రూపంలో నాకు ఈ అవకాశం వచ్చింది. రకరకాల కథలు మనం రాస్తుంటాం. కానీ మనం మొదటిసారి వస్తున్నప్పుడు సాలిడ్‌గా రావాలి. లేదంటే మళ్లీ అలానే వెనక్కి వెళ్లిపోతాం. వంద శాతం మన లక్ష్యాన్ని చేరుకోవాలి అని ఈ కథను రాశాను. అందుకే ఈ రైడింగ్ జానర్ ఎంచుకున్నాను. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొన్న సమయంలో కొత్త ప్రపంచానికి వెళ్లాను. ఎంతో మంది  కొత్త రచయితలను చూశాను. అలా అందరిలోంచి కొన్ని పాయింట్లను తీసుకుని రాయడంతో ఇదే మా కథ రెడీ అయింది. ఈ కథను నేను ముందుగా ఫీలవ్వాలని, ఆ తరువాతే మిగతా వాళ్లకు చెప్పాలని అనుకున్నాను. అందుకే ఐదు వేల కిలోమీటర్లు జర్నీ చేసుకుంటూ ఈ కథను రాశాను అని గర్వంగా చెప్పుకుంటున్నాను. శృంగేరీ, హంపీ, గోకర్ణ అంటూ ఇలా తిరిగాను. కథ రాశాను. ఆ కథను నిర్మాత మహేష్‌కు చెప్పాను. ఈ కథను అందరికీ చెప్పాలనే ఆశ అందరికంటే ఆయనకే ఎక్కువగా ఉండేది. ఈ సినిమాను ఎలాగైనా సరే థియేటర్లోనే విడుదల చేయాలని నిర్మాత ఫిక్స్ అయ్యారు. అక్టోబర్ 2న మా సినిమా రాబోతోంది. అక్టోబర్ 2న భారత దేశం ఎంత స్వచ్చంగా ఉంటుందో.. ఇదే మా కథ కూడా అంతే స్వచ్చంగా ఉంటుంది. ఈ సినిమాలో ఏదో  ఉంది.. చేద్దామని ముందుకు వచ్చిన శ్రీకాంత్, భూమిక, సుమంత్, తాన్యా అందరికీ థ్యాంక్స్. ఎంఎస్ రాజు గారు కూడా కథ విన్నారు. ఒక్క చిన్న పాయింట్‌లో కూడా ఎందుకు ప్రశ్న వేయలేదు. నన్ను ఎంతో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. అతిథిగా వచ్చిన బీ గోపాల్ గారికి థ్యాంక్స్’ అని అన్నారు.

 
 
ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. నేను మామూలుగా స్టేజ్ మీద ఎక్కువగా మాట్లాడను. ఎక్కడ పిలుస్తారో అని మూలకు వెళ్లి నిల్చున్నాను.  సినిమా గురించి అందరూ మాట్లాడేశారు. ఇక నేను మాట్లాడాల్సింది ఏం లేదు. ఈ చిత్రాన్ని మొదట ఓకే చేసింది నిర్మాత మహేష్ గారే. ఆయనే మొదటి హీరో. అందరినీ ఒప్పించి ఈ చిత్రంలోకి తీసుకొచ్చినందుకు డైరెక్టర్ గురు ఇంకో హీరో. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎమోషన్ అయ్యేట్టు చేసిన సినిమా ఇదే. శ్రీకాంత్, భూమిక,సుమంత్, తాన్యలు అంత అద్భుతంగా నటించారు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొని ఈ సినిమాను పూర్తి చేశారు. అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

 
 
దర్శకుడు బీ గోపాల్ మాట్లాడుతూ.. ‘ఇదే మా కథ టైటిల్ బాగుంది. పాటలు, లొకేషన్స్ ఇలా అన్నీ బాగున్నాయి. శ్రీకాంత్ వందల సినిమాలు చేశారు. అన్ని రకాల పాత్రలు చేశారు. అందరికీ మంచి స్నేహితుడు. నాకు ఎంతో ఇష్టమైన నటుడు. నాకు బాగా ఇష్టమైన నిర్మాత ఎంఎస్ రాజు. దేవీ, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం ఇలా ఎన్నో అద్భుతైన సినిమాలు తీశారు. ఆయన కుమారుడు సుమంత్ ఎన్నో మంచి చిత్రాలు చేశారు. ఈ చిత్రం మరింత విజయం సాధించాలని కోరుకుంటున్నాను.  ఈ చిత్రానికి పని చేసిన అందరికీ కంగ్రాట్స్. సినిమాను తీయడం ఒకెత్తు. కొత్త దర్శకుడుని మహష్ పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి.. ఇంకా ఎంతో మంది దర్శకులను పరిచయం చేయాలి. ఆయన ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి. ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

 
 
సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం నాకు ఎంతో స్పెషల్. సౌత్ నుంచి నార్త్ వరకు అంతా చూపించాం. మన దేశం ఎంతో అందమైందని నాకు తెలిసింది. ఇండియన్ అవ్వడం నాకు ఎంతో గర్వకారణంగా అనిపించింది. ఈ జర్నీని నాకెంతో ఇష్టమైన శ్రీకాంత్, భూమిక గారితో పని చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయనతో ఉన్న ఎక్స్ పీరియన్స్ గురించి రాయాలంటే పుస్తకాలు సరిపోవు. ఎంతో సీనియర్ అయినా కూడా ఓ బ్రదర్‌లా ఉండేవారు. ఎన్నో సలహాలు ఇచ్చేవారు. నేను ఇందులో బాగా చేశాను అని ఎవరైనా అంటే.. అది శ్రీకాంత్ గారి వల్లే. నా స్పీచ్‌ను మా నాన్న కొట్టేశారు. ఈ చిత్రానికి టెక్నికల్ యూనిట్ అంతా ఎంతో కష్టపడింది. కథను నమ్మి, ఎంతో ధైర్యంతో మహేష్ గారు చిత్రాన్ని తీశారు. అక్టోబర్ 2న మా సినిమా రాబోతోంది’ అని అన్నారు.

 
 
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ఇది మా కథ అనేది నాకు మంచి ఎక్స్‌పీరియన్స్. ఫీల్ గుడ్ కథ. ఓ నలుగురి కథ. వారి లక్ష్యాలు ఏంటి? వాటిని ఎలా చేరుకున్నారు. ఒకరినొకరు ఎలా హెల్ప్ చేసుకున్నారు అనేదే కథ. ఇలాంటి కథలను ఎలా డీల్ చేయాలి.. స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి.. నిర్మాతను ఒప్పించడం అనేదా చాలా కష్టం అని దర్శకుడు గురుకు చెప్పాను. మంచి నిర్మాత మహేష్ దొరికాడు అని గురు చెప్పారు. ముందు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయిపోయింది. బడ్జెట్ అసలు కంట్రోల్ అవ్వడం లేదు. ఆ కథే అలా కోరుకుంది.  సినిమా మీద ప్యాషన్ ఉంది కాబట్టే.. ఈ రోజు మహేష్ లాంటి నిర్మాత ఈ సినిమాను తీశారు. ఇలాంటి సినిమాలు రావాలంటే దర్శకులు, నిర్మాతలే ముఖ్యం. ప్రతీ చిన్న పాయింట్ కూడా వర్కవుట్ చేసుకున్నాడు. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి సినిమా చూశాం. ఎంతో  అద్భుతంగా ఉంది. నేను తోటీ హీరోలతో సినిమాలు చేశాను. కానీ యంగ్ హీరోతో పని చేయడం ఇదే మొదటిసారి. సుమంత్‌ను చూస్తే  నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. లఢఖ్‌లో వాటర్‌లో జంప్ చేసి యాక్షన్ సీక్వెన్స్ చేశాడు. అంత చలిలో అలా చేయడం చూసి నాకు భయమేసింది. ఎంతో కష్టపడుతున్నాడు.. ఎంతో భవిష్యత్తు ఉంది. డైలాగ్ డెలివరీ, మెమోరీ ఉన్న నటుడు. ఈ సినిమా సక్సెస్ అవుతుంది. కచ్చితంగా సుమంత్‌కు పేరు వస్తుంది. ఈ చిత్రం అక్టోబర్ 2న థియేటర్లోకి రాబోతోంది. అందరూ థియేటర్లోనే చూడండి’ అని అన్నారు.