నిను వీడని నీడను నేనే ఫస్ట్ టికెట్ లాంచ్ చేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్

Published On: July 12, 2019   |   Posted By:
నిను వీడని నీడను నేనే’ ఫస్ట్ టికెట్ లాంచ్ చేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్
 
సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించి, నిర్మించిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ అనిల్ సుంకర సమర్పణలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం (జూలై 12న) ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాను ఫస్ట్ టికెట్ ను యంగ్ రెబల్ స్టార్, ‘బాహుబలి’ ప్రభాస్ లాంచ్ చేశారు. ప్రచార చిత్రాలు చూశానని, ఈ చిత్రంతో సందీప్ కిషన్ మంచి విజయం అందుకుంటాడని ఆశిస్తున్నానని ఆయన ఆకాంక్షించారు. చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ “ప్రభాస్ అన్న అందరి మంచి కోరే వ్యక్తి. మంచి సినిమాలకు ఎప్పుడూ ఆయన అండగా నిలబడతారు. మేం అడగ్గానే మా ఆహ్వానాన్ని మన్నించి ‘నిను వీడని నీడను నేనే’ ఫస్ట్ టికెట్ లాంచ్ చేశారు. ప్రభాస్ అన్నకు చాలా చాలా థాంక్స్. కొన్ని గంటల్లో సినిమా విడుదలవుతోంది. ఇదొక న్యూ ఏజ్ హారర్ ఫిల్మ్. ప్రేక్షకులకు కొత్త సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. అందరికీ మంచి సినిమా చూపించాలనే ఉద్దేశంతో తీసిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది” అని అన్నారు.
 
పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, పూర్ణిమ భగ్యరాజ్, ప్రగతి తదితరులు నటించిన ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్రకుమార్ – ఫణి కందుకూరి, సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహణం: ప్రమోద్ వర్మ, ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: విదేష్, ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ  చెర్రీ, సీతారామ్, కిరుబాక‌ర‌న్‌, నిర్మాతలు: దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్, దర్శకుడు: కార్తీక్ రాజు.