మెగా దంప‌తుల ప‌రామ‌ర్శ‌పై రాజ‌నాల నాగ‌ల‌క్ష్మి స్పంద‌న‌

Published On: April 14, 2020   |   Posted By:
మెగా దంప‌తుల ప‌రామ‌ర్శ‌పై రాజ‌నాల నాగ‌ల‌క్ష్మి స్పంద‌న‌
 
ఈ జ‌న్మ‌కిది ఇది చాలు:  మెగా దంప‌తుల ప‌రామ‌ర్శ‌పై రాజ‌నాల నాగ‌ల‌క్ష్మి స్పంద‌న‌!
 
గుంటూరు జిల్లాకు చెందిన మెగా అభిమాని  రాజ‌నాల నాగ‌ల‌క్ష్మి అనే ఆమెకు స్టార్ హాస్పిట‌ల్ లో మేజ‌ర్ స‌ర్జ‌రీ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో  మెగాస్టార్ చిరంజీవి ఆమెకు ఎంత‌గానో స‌హ‌కారం అందించారు. కాగా  సోమ‌వారం  రాజనాల నాగలక్ష్మి గారిని స్టార్ హాస్ప‌టిట‌ల్స్  వారు ఆమెను ఐసీయూ నుంచి  ప్ర‌త్యేక గ‌దికి త‌ర‌లించారు. ఈ సందర్భంగా డాక్ట‌ర్లు ఆమె ఆరోగ్యం బాగుంద‌ని తెలిపారు. అలాగే రాజ‌నాల  నాగ‌ల‌క్ష్మి స్పృహలోకి రాగానే  చిరంజీవి  శ్రీమతి సురేఖ  స్వయంగా  నాగలక్ష్మి  వీడియో కాల్ ద్వారా ఆమె ఆరోగ్య యోగ క్షేమాల‌ను అడిగి తెలుసుకున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా చిరంజీవి దంప‌తులు ఆరోగ్యంగా ఉన్నార‌ని..ఏం కాద‌ని మీకు మేము ఉన్నామంటూ ధైర్యం చెప్పారు. అనంత‌రం నాగ‌ల‌క్ష్మి మాట్లాడుతూ, ` ఇది క‌లా..నిజ‌మా?  నా న‌డిచే దైవం శ్రీ చిరంజీవి గారు స్వ‌యంగా నాతో మాట్లాడ‌ట‌మా?  దీన్ని ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీమ‌తి సురేఖ గారు కూడా కుంటుంబ స‌భ్యురాలిగా నాతో ఎంతో ప్ర‌మ‌తో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ జ‌న్మ‌కి ఇది చాలు. ముక్కోటి దేవ‌త‌లు చిరంజీవి గారిని..వారి కుటుంబాన్ని చ‌ల్ల‌గా చూడాల‌ని, మ‌న‌స్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాని ఉద్వేగంతో, ఆనంద బాష్పాల‌తో మెగా దంప‌తుల ప‌రామ‌ర్శ‌కి బ‌ధులిచ్చారు.