మొక్కలు నాటిన దర్శకుడు బుచ్చిబాబు

Published On: July 25, 2020   |   Posted By:
 మొక్కలు నాటిన దర్శకుడు బుచ్చిబాబు
 
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన దర్శకుడు బుచ్చిబాబు (ఉప్పెన సినిమా )
 
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మైత్రి మూవీస్ నిర్మాత లలో ఒకరు అయిన రవి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు కాకీనాడ లోని తన నివాసంలో మొక్కలు నాటిన ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టి మా అందరి చేత మొక్కలు నటించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు.ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని.  ఈ సందర్భంగా విజయ్ సేతుపతి ప్రముఖ హీరో ;నవీన్ నూలీ ఎడిటర్; రామకృష్ణ ఆర్ట్ డైరెక్టర్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని కోరారు.