మొక్కలు నాటిన యాక్టర్ సామ్రాట్

Published On: July 13, 2020   |   Posted By:
మొక్కలు నాటిన యాక్టర్ సామ్రాట్
 
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన  సినిమా యాక్టర్ సామ్రాట్ 
 
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సినిమా యాక్టర్ సామ్రాట్ .
 
ఈ సందర్భంగా సామ్రాట్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ గారు చేపట్టిన హరితహారం కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా విజయవంతమైందని. హరితహారం స్ఫూర్తితో గౌరవ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారని నాకు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం బాగా ఆకట్టుకుందని. ఇప్పటికే మనం నీరు కోనుకుంటున్నామని భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కునే ఈ పరిస్థితి రాకూడదని భవిష్యత్ తరాలకు మనము ఇచ్చేది ఒకటే మంచి వాతావరణాన్ని అందించడం. కాబట్టి మనందరం కూడా మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. నేను కూడా ప్రతిరోజు ఆఫీసుకి వెళ్ళే సమయంలో తప్పకుండా నేను నాటిన మొక్క రక్షించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమం ఎన్ని కష్టాలు వచ్చిన , కరోనా సమయంలో కూడా చెట్లు నాటే కార్యక్రమం ఆగకూడదు అన్నారు