శ్రీ శివాయ్ ఫిలింస్ బ్యానర్ పై  కొత్త  చిత్రం  ప్రారంభం

Published On: November 11, 2019   |   Posted By:
శ్రీ శివాయ్ ఫిలింస్ బ్యానర్ పై  కొత్త  చిత్రం  ప్రారంభం 
 
గౌతమ్ వ్యాస్  ,మిస్  తెలంగాణ దీపికా వధాని లను  హీరో హీరోయిన్లుగా పరిచయం  చేస్తూ శ్రీ శివాయ్ ఫిలింస్ బ్యానర్ పై  స్రవంతి మురళీ మోహన్ తెరకెక్కిస్తున్న ప్రొడక్షన్ నెం 1  చిత్రం హైద్రాబాద్ లో ప్రారంభమైంది . కె. రమేష్  బాబు  నిర్మిస్తున్న ఈ  చిత్రంలో శ్రీమంతుడు ,ఖైదీ  చిత్రాల  ఫేం హరీష్  ఉత్తమన్ కీలక పాత్ర పోషిస్తుండగా..  అర్ధనారీ చిత్రం  హీరో  అర్జున్  విలన్ గా  నటిస్తున్నారు . పూజ కార్యక్రమాల అనంతరం .. 
 
చిత్ర దర్శకుడు స్రవంతి మురళీ మోహన్  మాట్లాడుతూ:  గౌతమ్ వ్యాస్  ,మిస్  తెలంగాణ దీపికా వధాని లను  హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తున్న  ఈ  చిత్రాన్ని లవ్  అండ్  యాక్షన్ ఎంటర్ టైనర్ జోనర్ లో రూపొందిస్తున్నామని తెలిపారు . సినిమా  ఫస్ట్  షెడ్యూల్  హైద్రాబాద్  లో ,సెకండ్ షెడ్యూల్ గోవాలో  ,థర్డ్ షెడ్యూల్  కేరళలో  చేయనున్నట్లు  తెలిపారు . నలభై రోజుల్లో  సినిమా పూర్తి చేస్తామని అన్నారు . 
 
చిత్ర నిర్మాత కె .రమేష్ బాబు మాట్లాడుతూ : దర్శకులు  స్రవంతి మురళీ మోహన్ చెప్పిన  కథ బాగా నచ్చింది . ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ గా నిర్మిస్తామని తెలిపారు 
 
సాంకేతిక వర్గం  : హీరో హీరోయిన్లు  : గౌతమ్ వ్యాస్  ,మిస్  తెలంగాణ దీపికా వధాని, కెమెరా  : జి ఎస్ .రాజ్  (మురళి ) ,మ్యూజిక్  :శివ నందిగామ , పి .ఆర్ .ఓ : శ్రీధర్  , చీఫ్ అసోసియేట్ :అనిల్ పురేటి  , నిర్మాత  : కె . రమేష్ బాబు , కథ ,స్క్రీన్ ప్లే – గౌతమ్  vyas దర్శకత్వం : స్రవంతి మురళీ మోహన్