సినిమా కథా చిత్రమ్ ఆడియో లాంచ్

Published On: January 2, 2020   |   Posted By:
సినిమా కథా చిత్రమ్ ` ఆడియో లాంచ్

   
 `వంశం` చిత్రానికి 13 అవార్డ్స్ సొంతం చేసుకున్న దర్శకుడు   రామ్ మధుసూదన్ దర్శకత్వం లో వస్తోన్న తాజా చిత్రం `సినిమా కథా చిత్రమ్.
 
 
రామ్ ఫిలిమ్స్ పతాకం పై  మదన్మోహన్ నాయుడు , జి. తిమ్మా రెడ్డి గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  రుషి లక్ష్మణ్ , ఉమేష్, సాయికుమార్,  జాకీ షరాఫ్, షీనా రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ , తెలుగు భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఆడియో లాంచ్ బుధవారం ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టి.రామసత్యనారాయణ , మోహన్ గౌడ్ , సాయివెంకట్ విచ్చేశారు.  
 
 
 
టి. రామసత్యనారాయణ మాట్లాడుతూ… వంశం, ప్రేమ చరిత్ర  లాంటి మంచి చిత్రాలు చేశారు .  వంశం చిత్రానికి ఏకంగా 13 అవార్డ్స్ తీసుకున్నారు.  ఇక `సినిమా కథా చిత్రమ్ `. ,  సాంగ్స్ ,  ట్రైలర్ బావున్నాయి. రామ్ మధుసూదన్ సినిమాలు టెక్నికల్ వాల్యూస్ తో ఉంటాయి. ఈ సినిమా పెద్ద  సక్సెస్ అవ్వాలన్నారు`.
 
 
లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ…“రామ్ మధుసూదన్ గారు ఎన్నో మంచి సినిమాలు తీశారు. ఈ సినిమా ట్రైలర్. పాటలు బావున్నాయి. సినిమా పెద్ద సక్సెస్ కావాలన్నారు.
 మోహన్ గౌడ్ మాట్లాడుతూ …“ ట్రైలర్ చూసాక మంచి హార్రర్ సినిమా అని తెలుస్తోంది . పాటలు కూడా బావున్నాయి. మంచి టైటిల్ పెట్టారు. టీం అందరికి నా శుభాకాంక్షలు“ అన్నారు.  
 
నటుడు ఉమేష్ మాట్లాడుతూ…“ డైరెక్టర్. ప్రొడ్యూసర్ నాకు మంచి మిత్రులు. ఈ సినిమాలో నేను మంచి క్యారక్టర్ చేశాను. తెలుగు, కన్నడ రెండు భాషల్లో మంచి సక్సెస్ కావాలన్నారు.
నిర్మాత  జి. తిమ్మా రెడ్డి గౌడ్ మాట్లాడుతూ …“డైరెక్టర్ రామ్ మధుసూదన్ మంచి  కాన్సెప్ట్ తో సినిమా చేసారు.  ఎక్కడా  రాజీ పడకుండా తెలుగు , కన్నడ భాషల్లో నిర్మించాము. జాకీ స్రాఫ్ గారు, సాయికుమార్ గారు చాలా సపోర్ట్ చేశారు. మా సినిమాను తెలుగు ప్రేక్షకులు సక్సెస్ చేస్తారని “ కోరుకుంటున్నాం“ అన్నారు.  
 
 
డైరెక్టర్ రామ్ మధుసూదన్ మాట్లాడుతూ …“వంశం చిత్రానికి 13 అవార్డ్స్ వచ్చాయి. రామానాయుడు గారు అప్పట్లో పిలిచి అభినందిచడమే కాకుండా మనం కలిసి సినిమా చేద్దాం అన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఇక ఆ తర్వాత చాలా సినిమాలు చేశాను.   లేటెస్ట్ గా రుషి ని హీరోగా పరిచయము చేస్తూ       `సినిమా కథా చిత్రమ్ ` చేశాను.  అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాము“ అన్నారు.