అమితాబ్ బచ్చన్ ఫస్ట్ లుక్ ట్రైలర్ విడుదల

Published On: March 24, 2022   |   Posted By:

అమితాబ్ బచ్చన్ ఫస్ట్ లుక్ ట్రైలర్ విడుదల

తార శ్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై సూర్య, రీతూ శ్రీ హీరోహీరోయిన్లుగా జె. మోహన్ కాంత్ దర్శకత్వంలో.. జె. చిన్నారి నిర్మించిన చిత్రం ‘అమితాబ్ బచ్చన్’. అక్కల శ్రీనివాస్ రాజు సహనిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ చిత్ర ఫస్ట్ లుక్, ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి చిత్రయూనిట్‌తో పాటు ప్రముఖ పారిశ్రామిక వేత్త సుదర్శన్ రెడ్డి, సతీష్ రెడ్డి, కందల శివకుమార్, మణి వంటివారు పాల్గొని చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు. చిత్ర ఫస్ట్ లుక్‌ని సతీష్ రెడ్డి విడుదల చేయగా.. ట్రైలర్‌ని సుదర్శన్ రెడ్డి విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు జె. మోహన్ కాంత్ మాట్లాడుతూ.. ‘‘అమితాబచ్చన్.. ఈ పేరొక సంచలనం. ఈ పేరొక ప్రభంజనం. అయితే ఇది ఆయన బయోపిక్ మాత్రం కాదు. ఓ మంచి ప్రేమకథ. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. సినిమా చాలా బాగా వస్తుంది. ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఎందుకంటే మంచి కథతో పాటు అన్ని కమర్షియల్ అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ప్రస్తుతం షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చి మా టీమ్‌ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను తెలియజేస్తాం. ఈ సందర్భంగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నాం. ఇటీవల బాలీవుడ్‌లో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి మా టీమ్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. ధైర్యంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన దర్శకనిర్మాతలకు ప్రత్యేక అభినందనలు..’’ అని తెలిపారు.
సూర్య, రీతూ శ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో చిల్లర వేణు, ఉన్ని కృష్ణ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు:
లిరిక్స్: రామ్‌కుమార్ ASK,
ఫైట్స్: స్టార్ మల్లీ-జీవన్ కుమార్
సంగీతం: ఆశ్రీత్ అయ్యంగార్,
సినిమాటోగ్రఫీ: కిరణ్ దాసరి,
ఎడిటర్: మహేంద్రనాధ్. బి,
సహనిర్మాత: ఆకుల శ్రీనివాస్ రాజు,
నిర్మాత: జె. చిన్నారి,
కథ-దర్శకత్వం: జమ్మల మడుగు మోహన్ కాంత్.