ఆడవాళ్ళు మీకు జోహార్లు చిత్ర యూనిట్  ప్రెస్ మీట్

Published On: March 7, 2022   |   Posted By:

ఆడవాళ్ళు మీకు జోహార్లు చిత్ర యూనిట్  ప్రెస్ మీట్

ఫ్యామిలీస్ థియేటర్ కు వచ్చి మెచ్చుకుంటున్నారు – శర్వానంద్

శర్వానంద్, రష్మిక మందన్న జంట గా నటించిన సినిమా ఆడవాళ్ళు మీకు జోహార్లు.  ఈనెల 4న శుక్రవారం నాడు విడుదలయింది.  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై  సుధాకర్ చెరుకూరి నిర్మించారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు.  శ్రీకాంత్ సహ నిర్మాతగా వ్యవహరించారు.

ఈ చిత్రం థియేటర్లలో మంచి ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ శనివారం నాడు రామానాయుడు స్టూడియోలో చిత్ర యూనిట్  ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ, నేను చెప్పినట్లుగానే విడుదల రోజు మా అమ్మ నాన్న థియేటర్లో సినిమా చూశారు. ఇలాంటి సినిమా రావడానికి చాలా కాలం పట్టిందని తెలిపారు. ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్ ను వారు వ్యక్తం చేశారు. ఇంటిలోని మహిళలు కూడా చూసే సినిమా ఇది. మన కుటుంబంలోని వ్యక్తులు ఈ సినిమాలోని పాత్రలు ద్వారా మన కళ్ళ ముందు కనిపిస్తారు. నిన్న కొన్ని థియేటర్లకు వెళ్ళాం. అక్కడ అంతా ఫ్యామిలీ తోనే  సినిమాకు వచ్చారు. వచ్చే వారం కూడా మంచి ఆదరణ పొందుతుందనే నమ్మకముంది అన్నారు.ఈ సందర్భంగా తన పెండ్లి గురించి వివరిస్తూ, సినిమాలో చూపించినట్లుగా నా తల్లి ఖుష్బూ ఎంత కేర్ తీసుకుంటుందో తెలిసిందే. కానీ మా అమ్మ నాన్నలు నీకు నచ్చితే మేం మాట్లాడతాం అని చెప్పారని అన్నారు.

శర్వానంద్ మాట్లాడుతూ, మేం విడుదలకు ముందు ఏదైతే అనుకున్నామో అది నేడు జరిగింది. చాలా సంతోషంగా వుంది. నా కుటుంబసభ్యులుతోపాటు స్నేహితులు కూడా సినిమా చూసి బాగుందన్నారు. ఇది బాగోలేదని ఒక్కరూ కూడా అనడం నేను వినలేదు. మనింటిలో జరిగే కథలా వుంటుంది. మేం నవ్విస్తామని చెప్పాం. అలాగే థియేటర్లలో ప్రేక్షకులు నవ్వుతూనే వున్నారు. హ్యాపీగా చాలా రోజుల తర్వాత థియేటర్కు వచ్చి ఎంజాయ్ చేస్తున్నామని ప్రేక్షకులు చెబుతున్నారని అన్నారు.

దర్శకుడు కిషోర్ తిరుమల తెలుపుతూ, సహజంగా సినిమా విడుదలైతే ఒకటి, రెండు టిక్కెట్లు అడుగుతారు. కానీ నిన్న ఈ సినిమా విడుదలయినప్పుడు 10 టిక్కెట్లు కావాలని ఫోన్లు వచ్చాయి. చూసిన వారు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇంటర్వెల్ లో వున్న ట్విస్ట్కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాను ఆదరిస్తున్న మహిళలకు, ప్రేక్షకులకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న మా వీధిలోని వారంతా కలిసి సినిమా చూశారు. `నేను శైలజ`తో కాకుండా ఈ సినిమా నీకు మంచి గుర్తింపు వచ్చిందనివారు తెలియజేయడం సంతోషంగా వుంది.` అన్నారు.

నటి రుచిత మాట్లాడుతూ, నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు.. మొదట ప్రవల్లిక పాత్ర చెప్పినప్పుడు చేయలేనేమో అని అనుకున్నా. కానీ నాచేత చేయించారు. శర్వానంద్, రష్మిక సెట్లో వుంటే అంతా సరదాగా వుంటుంది. ఇందులో నటించిన సీనియర్ నటీమణులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నారు.

నటి దీప్తి మాట్లాడుతూ, ఇలాంటి సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా వుందన్నారు.

సహ నిర్మాత శ్రీకాంత్ తెలుపుతూ, నిన్న కొన్ని థియేటర్లకు వెళ్ళి  సినిమా చూశాం. ప్రేక్షకులు చాలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్బంగా శర్వానంద్, రష్మికకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వారంలో మరింతమంది సినిమా చూసి ఆనందించండి అని తెలిపారు.

కెమెరామెన్ సుజిత్ తెలుపుతూ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ను ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.