Reading Time: < 1 min

ధూం ధాం మూవీ ఫస్ట్ సింగిల్ మల్లెపూల టాక్సీ ప్రోమో విడుదల

ధూం ధాం మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ మల్లెపూల టాక్సీ.. ప్రోమో రిలీజ్, ఈ నెల 5న ఫుల్ లిరికల్ సాంగ్ విడుదల

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ధూం ధాం. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. ధూం ధాం సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు ధూం ధాం సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ మల్లెపూల టాక్సీ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోను ఈ నెల 5వ తేదీన ఉదయం 9.18 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. మల్లెపూల టాక్సీ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా..గోపీ సుందర్ క్యాచీ బీట్ తో కంపోజ్ చేశారు. గాయని మంగ్లీ ఈ పాటను ఎనర్జిటిక్ గా పాడటమే కాదు లిరికల్ వీడియోలో స్టెప్స్ వేసి ఆకట్టుకుంది.

నటీనటులు :

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు

టెక్నికల్ టీమ్ :

ఎడిటింగ్ : అమర్ రెడ్డి కుడుముల
సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ్ రామస్వామి
మ్యూజిక్ : గోపీ సుందర్
ప్రొడ్యూసర్ : ఎంఎస్ రామ్ కుమార్
డైరెక్టర్ : సాయి కిషోర్ మచ్చా