నువ్వంటే నేనని చిత్రం లిరికల్ సాంగ్ విడుదల

Published On: June 29, 2021   |   Posted By:

నువ్వంటే నేనని చిత్రం లిరికల్ సాంగ్ విడుదల

తెలుగు సినీ ప్రేక్షకులకు సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ సానా  క్రియేషన్స్ బ్యానర్ ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సానా యాదిరెడ్డి దర్శక నిర్మాతగా  ‘పిట్టల దొర’ బ్యాచిలర్స్ ,  సంపెంగి, ప్రేమ పల్లకి,  జై బజరంగభళి వంటి స్మాల్ బడ్జెట్ తో తీసిన మూవీస్ మ్యూజికల్ గా పెద్ద సక్సెస్ లు సాధించాయి. 2004వ సంవత్సరం హైదరాబాద్ లో జరిగిన ఓ యదార్ధ సంఘటనల  ఆధారంగా తయారు చేసుకున్న సరి కొత్త ప్రేమకథ తో రూపుదిద్దుకున్న మరో మ్యూజికల్ చిత్రం ‘నువ్వంటే నేనని’.   ఎన్నో ఏళ్ళ గ్యాప్ తరువాత మళ్ళీ  మీ ముందుకొచ్చారు సాన యాది రెడ్డి.  గత ఏడాది షూటింగ్ ఇతర కార్యక్ర మా లను పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా క్రైసిస్ కారణం గా విడుదల ఆగింది. ఈ ఏడాది కూడా రెండో దశ కూడా కరోనా కారణంగా యావత్ సినీ పరిశ్రమ గందర గోల పరిస్థితి నెలకొంది. పెద్ద సినిమాలే విడుదల తేదీలు తారుమారు అయ్యాయి. ఇక యదా పరిస్థితి కి చేరుతున్న తరుణం లో  ‘నువ్వంటే నేనని’ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఈ చిత్రంలోని ఫస్ట్  లిరికల్ సాంగ్ ను డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతుల మీదుగా ఈ రోజు సాయంత్రం 5:49 లకు విడుదల చేయడం జరిగింది.

ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ –  ” దర్శక నిర్మాత సానా యాది రెడ్డి గారు మంచి అభిరుచి గల దర్శకుడు ఆయన చేసిన చిత్రాలలో సంగీతానికి, సాహిత్యానికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజు నేను విడుదల చేసిన ‘నమ్మవే చెలి’ పాటలో మంచి లిరికల్ వ్యాలూస్ వున్నాయి. వరికుప్పల యాదగిరి ఈ పాటను రాసి తానే సంగీతాన్ని అందించడం విశేషం. పాట అద్భుతంగా వుంది ఈ రోజే చూసాను సిద్ శ్రీరామ్ పాడిన టాప్ సాంగ్స్ లో ఈ పాట నిలబడుతుంది . ఈ చిత్రం లో నటించిన నటి నటులకు, సాంకేతిక నిపుణులకు నా అభినందనలు. ” అన్నారు.    

ఈ సందర్భంగా దర్శక నిర్మాత సానా యాది రెడ్డి మాట్లాడుతూ – ” తెలుగు ప్రేక్షకులు  పీరియాడికల్, బయోపిక్  చిత్రాలను ఆదరిస్తారని ఇటీవల సక్సెస్ సాధించిన  ‘రంగ స్థలం’  ‘మహా నటి’ ‘జార్జి రెడ్డి’ ‘యాత్ర’ వంటి చిత్రాలు నిరూపించాయి. అదే స్ఫూర్తి తో నేను ఓ కథ రెడీ చేశాను. 2004  హైదరాబాద్ లో జరిగిన ఓ యదార్ధ సంఘటనల  ఆధారంగా రాసుకున్నసరి కొత్త ప్రేమకథను తెరకెక్కిచాను.  నా బ్యానర్ ద్వారా అప్పట్లో కమెడియన్ గా చేస్తున్న అలీ ని పెట్టి  ‘పిట్టల దొర’ గా, సంపెంగి చిత్రంతో  హీరో హీరోయిన్ లు గా దీపక్, కాంచి కౌల్ ని, బ్యాచిలర్స్ సినిమాతో శివాజీ వంటి హీరోను పరిచయం చేయడం జరిగింది.
 
ఇప్పడు మళ్ళీ నూతన హీరో హీరోయిన్లతోనే  ‘నువ్వంటే నేనని’ అనే చిత్రాన్ని నిర్మించాను. అదే విధంగా నా చిత్రాల ద్వారా  వరికుప్పల యాదగిరిని పాటల రచయితగా పరిచయం చేశాను. ఇప్పుడు ఈ చిత్రంతో అతన్ని మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నాను. ఈ సినిమాకి అతని పాటలు  ఓ  హైలెట్ గా నిలుస్తాయి. గత ఏడాది షూటింగ్ పార్ట్ పూర్తి చేసి,  ఈ ఏడాది జనవరి లో మా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ కాపీ రెడీ చేసాం. గత రెండు ఏళ్లుగా మనల్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్  కారణంగా యావత్ భారతావని అన్ని రంగాలలో వెనక్కు వెళ్ళింది. ఇప్పుడైనా పరిస్థితి యదావిధిగా వుంటుందనే ఆశతో మా చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ ఆడియో లో….  ఈ రోజు దర్శకుడు హరీష్ శంకర్ చేతులమీదుగా ఫస్ట్ లిరికల్ సాంగ్ ని విడుదల చేయడం జరిగింది, ఆయనకు నా ధన్యవాదాలు.  పాపులర్ సింగర్ సిద్ శ్రీ రామ్ పాడిన ఈ పాట ను వరికుప్పల యాదగిరి రచనలో సంగీత స్వరాలూ అందించడం జరిగింది. నా గత చిత్రాలలో పాటలను ఆదరించినట్లే  నా తాజా చిత్రం ‘నువ్వంటే నేనని’ ని కూడా విని ,  చూసి  ఆనందిస్తారని ఆశిస్తున్నాను”అన్నారు.  

మ్యూజిక్ డైరెక్టర్, పాటల రచయిత వరికుప్పల యాదగిరి మాట్లాడుతూ – ” నేను తొలిసారి మ్యూజిక్ డైరెక్షన్ లో చేసిన నా పాటను  పవర్ ఫుల్ దర్శకుడు హరీష్ శంకర్ చేతుల మీదుగా రిలీజ్ కావడం ఆనందంగా వుంది. నన్ను పాటల రచయితగా పరిచయం చేసిన సాన యాది  రెడ్డి గారు, సంగీత దర్శకుడిగా కూడా అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను  ఆయనకు నేనెప్పుడూ రుణ పడివుంటాను. ” అన్నారు.  

నటీనటులు : నకుల్, శ్వేతా (నూతన  పరిచయం) చంద్ర మోహన్, దువ్వాసి మోహన్, ‘చిత్రం’ శ్రీను  తదితరులు  
సాంకేతిక నిపుణులు:
కథ : పరమేష్ – రామ్ కుమార్,
మాటలు: పోలూరు ఘటికా చలం
కెమెరామెన్: విజయ్. సి .కుమార్,
పాటలు, సంగీతం : వరికుప్పల యాదగిరి
ఎడిటర్: రమేష్,
డాన్స్ : స్వర్ణ – దివ్య
ఫైట్స్ : రామ్ – లక్ష్మణ్
సమర్పణ: సాన నిఖిలేష్ రెడ్డి  
నిర్మాత : సానా  భాగ్య లక్ష్మి
కాన్సెప్ట్ , స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సానా  యాదిరెడ్డి
 
పల్లవి:
నమ్మవే చెలి నిన్ను నేను ప్రేమిస్తన్నానే
నా మనస్సులో నిన్ను నిలిపి పూజిస్తున్నానే
కంటిలోని పాపాల ఉండిపోవే
గుండెలోన ఊపిరై నిండిపోవే
నమ్మవే చెలి నిన్ను నేను ప్రేమిస్తన్నానే
నా మనస్సులో నిన్ను నిలిపి పూజిస్తున్నానే

మొదటి చరణం :
నీవులేని లోకమంతా శున్యమల్లెతోస్తుంది
చావురాక ఉండలేక బ్రతుకు నరకమౌతుంది
తోడువుంటే ప్రపంచమంతా వసంతమై పూస్తుంది
నీడలాంటి నిన్ను చూసి మనసుమురిసి పోతుంది
పున్నమల్లే వెన్నెలున్నా నీవులేక చీకటేలే
కనులున్న కానరాక గుండెలోన భాధరగిలే
రాతిరైతే నిద్దరైనా రాను రాను పొమ్మంటుంది

నమ్మవే చెలి నిన్ను నేను ప్రేమిస్తన్నానే
నా మనస్సులో నిన్ను నిలిపి పూజిస్తున్నానే

రెండవ  చరణం :
దూరమైతే గుండెకూడా భారమైపోతుంది
దేగ్గరైతే గొంతు దాటి మాట కూడా రాకుంది
చేరువై కౌగిలిస్తే ఒదిగిపోవాలని వుంది
మరుగుతున్న గుండెలోకి చలువ చేరుకుంటుంది
కళ్ళలోకి చూసావంటే నీ రూపుకనబడుతుంది
తల్లడిల్లిపోతూ వున్నా మనసు భాద తెలిసొస్తుంది
కల్లాకాదు నాలో ప్రేమ ప్రాణమైన  అర్పిస్తోంది

నమ్మవే చెలి నిన్ను నేను ప్రేమిస్తన్నానే
నా మనస్సులో నిన్ను నిలిపి పూజిస్తున్నానే
కంటిలోని పాపాల ఉండిపోవే
గుండెలోన ఊపిరై నిండిపోవే
నమ్మవే చెలి నిన్ను నేను ప్రేమిస్తన్నానే
నా మనస్సులో నిన్ను నిలిపి పూజిస్తున్నాన