మళ్లీ త్రివిక్రమే హైలైట్ అయ్యాడు

Published On: September 2, 2021   |   Posted By:

మళ్లీ త్రివిక్రమే హైలైట్ అయ్యాడు

పవన్ కళ్యాణ్- రానా కాంబినేషన్ లో సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో సితార ఎంటెర్టైమెంట్స్ నిర్మాణం లో భీమ్లా నాయక్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి మాటల నిపుణుడు త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే రచయిత గా పని చేస్తున్నాడు. అయితే మొదటి నుండీ మీడియా లో సాగర్ కే చంద్ర కన్నా త్రివిక్రమ్ హైలైట్ అవుతూ వస్తున్నాడు.

గతం లో రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోస్ లో కూడా సాగర్ చంద్రది త్రివిక్రమ్ తర్వాత స్థానమే. అప్పుడే ఈ విషయంలో జనాలలో చర్చ జరిగింది. అయితే ఈ రోజు విడుదలైన భీమ్లా నాయక్ మొదటి పాటని చూస్తే వాళ్ళు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకున్నట్టు లేరు ఎందుకంటే ఈ పాటలో కూడా మిగిలిన అందరి కంటే త్రివిక్రమ్ అనే పేరు కొన్ని క్షణాలు ఎక్కువే కనపడింది.

దీనిని బట్టి భీమ్లా నాయక్ యూనిట్ “రచయిత-దర్శకుడు” చర్చని లైట్ తీసుకున్నట్టు కనపడుతోంది.