మోసగాళ్లకు మోసగాడు చిత్రం 50సంవత్సరాలు పూర్తి

Published On: August 26, 2021   |   Posted By:

మోసగాళ్లకు మోసగాడు చిత్రం 50సంవత్సరాలు పూర్తి

పద్మాలయా స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం పై ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు ప్రతిష్టాత్మకం గా నిర్మించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రం 50సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆగస్ట్ 27 1971 న విడుదలైన ఈ సినిమా తెలుగు సినిమా స్టామినా అంతర్జాతీయ స్థాయి లో మోత మోగించింది. పాన్ ఇండియా సినిమా అని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో గ్రాఫిక్స్ లేకుండా సినిమా తీయలేరు. కానీ ఆ రోజుల్లోనే సూపర్ స్టార్ కృష్ణ గారు పాన్ ఇండియా సినిమా తీసి చూపించారు.

 

మోసగాళ్లకు మోసగాడు 56 దేశాలలో ప్రదర్శింపబడి ప్రకంపనలు సృష్టించింది. తమిళ్ లో మోసక్కారన్ కు మోసక్కారన్ ఇంగ్లీష్ లో ట్రెజర్ హంట్ పెరు తో డబ్బింగ్ చేయబడినది. రిపీట్ రన్ లో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ప్రదర్శింప బడే ది అని ఇటీవల కృష్ణ గారు పలు సందర్భాలలో చెప్పేవారు.

వి ఎస్ ఆర్ స్వామి ఫోటోగ్రఫీ మాధవరావు గారి మేకప్ పనితనం ఆదినారాయణ రావు గారు సంగీత ము లో సూపర్ హిట్ పాటలు నేపధ్య సంగీతం ప్రేక్షకులను అభిమానులకు నూతన అనుభూతిని అందించాయి. హీరోయిన్ విజయనిర్మల గారి తో కృష్ణ గారు కొరినది నెరవేరింది పాట చిత్రీకరణ కోసం డార్జిలింగ్ వెళ్లి చిత్రికరించడం విశేషం.

 

ఈ రోజు తో పద్మాలయా సంస్థ కూడా 50 వసంతాలు పూర్తి చేసుకోవడం విశేషం .కృష్ణ గారి సాహసోపేత నిర్ణయాలకు వారి సోదరులు హనుమంతరావు అదిశేషగిరి రావు సహకారం తో. విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. అమితాబచ్చన్ రజనీకాంత్ లాంటి అగ్రనటులతో సినిమాలు నిర్మించిన ఏకైక సంస్థ పద్మాలయా. వరుసగా పాతాళ బై రవి మవ్వాలి హిమ్మత్ వాలా 3 సిల్వర్ జూబ్లీ లు నిర్మిచిన ఏకైక దక్షిణ భారత నిర్మాణ సంస్థ పద్మాలయా. దర్శకులు కె రాఘవేంద్రరావు ఈ వి వి సత్యనారాయణ హీరోయిన్స్ శ్రీదేవి సౌందర్య లను హిందీ చిత్ర సీమకు పరిచయం చేసిన సంస్థ.

50 వసంతాలు పూర్తి అయిన సందర్భముగా కృష్ణ గారు వారి సోదరులు అది శేషగిరిరావు గారు మాట్లాడుతూ పద్మాలయా సంస్థ మళ్ళీ సినిమా నిర్మాణము చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. హనుమంతరావు గారి కుమారులు ప్రసాద్ బాబు నరసయ్య బాబు అదిశేషగిరి రావు గారి కుమారుడు రాఘవ రత్న బాబు సారథ్యం లో సంస్థ ప్రణాళికలు సిద్ధం అవుతున్నట్లు తెలియవచ్చిది