సర్కారు వారి పాట మూవీ అప్డేట్స్

Published On: June 11, 2021   |   Posted By:
 
Image
సర్కారు వారి పాట మూవీ అప్డేట్స్
 
 
సర్కారు వారి పాట షూటింగ్ తిరిగి ప్రారంభించగానే మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అధికారికంగా ప్రకటిస్తాం – చిత్ర యూనిట్. 
 
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న భారీ చిత్రం ‘సర్కారు వారి పాట`. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. త‌మ‌న్ ఎస్.ఎస్. సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే..కాగా  ‘సర్కారు వారి పాట షూటింగ్ తిరిగి ప్రారంభించిన తర్వాత ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అధికారికంగా ప్రకటిస్తామని అప్పటివరకు కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ సురక్షితంగా ఉండండి’ అని చిత్ర యూనిట్ తెలిపింది. 
 
సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు మరియు భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి,
సంగీతం: త‌మన్ ఎస్‌.ఎస్‌,
సినిమాటోగ్ర‌ఫి: మ‌ధి,
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్,
ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్,
ఫైట్ మాస్టర్: రామ్ – లక్ష్మణ్, 
లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్,
కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్,    
సీఈఓ: చెర్రీ,
నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట,
రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల‌.