Reading Time: 2 mins

Saripodhaa Shanivaaram Heroine Priyanka Arul Mohan

సరిపోదా శనివారం నటి ప్రియాంకా అరుళ్ మోహన్ 

అందం, అభినయంతో పాటు అనుకువ ఉన్న నటి ప్రియాంకా అరుళ్ మోహాన్. పక్కింటి అమ్మాయిలా అనిపించడమే కాదు నటించడంలో కూడా అంతే సహజత్వం ప్రదర్శిస్తుంది. తీసినవి కొన్ని సినిమాలే అయినా మలయాళం, తమిళ్, తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. చక్కని నవ్వుతో పాటు నిర్మలమైన ముఖం ఆమెకు అలంకారం. అందుకే నేచురల్ స్టార్ నాని రెండవ సారి ప్రియాంకాతో నటించడానికి పచ్చజెండా ఊపారు. వీరి కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ఆగస్టు 29న విడుదలకు సిద్దం అయింది. ఈ సందర్భంగా ప్రియాంక అరుళ్ మోహన్ సినిమా విశేషాలు చూద్దాం.

ప్రియాంకా అరుళ్ మోహాన్ 20 నవంబర్ 1990లో జన్మించింది. సినిమా రంగంలోకి ఎంట్రీ అవకముందు బయోలాజికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంది. ఆ తరువాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ప్రియాంకాకు కన్నడ సినిమాలో తొలి అవకాశం వచ్చింది. 2019లో ‘ఒంద్ కతే హెల్లా'(Ondh Kathe Hella) చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అదే సంవత్సరం తెలుగు తెరపై తెరంగేట్రం చేసింది. నేచురల్ స్టార్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ‘నాని గ్యాంగ్ లీడర్’ చిత్రంలో ప్రియా పాత్రలో నటించింది. అమాయకమైన తన అందంతో తెరపై మాయ చేసింది. ఆ తరువాత శర్వానంద్ సరసన ‘శ్రీకారం’ చిత్రంలో మెరిసింది. అయితే తెలుగులో నటించిన ‘గ్యాంగ్ లీడర్’ యావరేజ్ టాక్ తెచ్చుకోగా.. ‘శ్రీకారం’ చిత్రం పెద్దగా ఆడలేదు.

 

ఆ తరువాత తమిళంలో ‘వరుణ్ డాక్టర్’ చిత్రంతో తమళ్‌లో డెబ్యూగా ఎంట్రీ ఇచ్చింది. శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. మళ్లీ శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ‘డాన్’ చిత్రంలో కూడా ప్రియాంకానే హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. తమిళ సూపర్ స్టార్ సూర్యతో కలిసి ‘ఈటీ’ మూవీలో నటించింది. అలాగే మాస్ మహారాజ్ హీరోగా నటించిన రావణాసుర చిత్రంలో అలరించింది. అలాగే టిక్ టాక్ చిత్రంలో నటించింది. ఇలాంటి సమయంలో ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో నటించే అవకాశం అందిపుచ్చుకుంది. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ‘ఓజీ’ చిత్రంలో ప్రియాంకా నటించడడంతో పవన్ ఫ్యాన్స్ ఎంతో అతృతంగా ఎదురుచూస్తున్నారు.

హీరో ధనుష్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రంలో ఆమె నటనటకు మంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ చిత్రంలో పోలీసు కానిస్టేబుల్ చారులతగా కనిపించబోతున్నారు. డీవీవీ దానయ్య నిర్మాతగా రూపోందిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ఎస్ జే సూర్య విలన్ రోల్ చేస్తున్నారు. జేక్స్ బెజోయ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అందిస్తుందో చూడాలి మరి.