Reading Time: < 1 min

సర్కారు నౌకరి మూవీ లిరికల్ సాంగ్ విడుదల

సర్కారు నౌకరి నుంచి నీ పసుపు పాదాలే లిరికల్ సాంగ్ రిలీజ్, జనవరి 1న థియేటర్స్ లో మూవీ విడుదల

ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయవుతున్న సినిమా సర్కారు నౌకరి. ఈ చిత్రంలో భావన హీరోయిన్ గా నటిస్తోంది. సర్కారు నౌకరి చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. సర్కారు నౌకరి సినిమా న్యూఇయర్ సందర్భంగా వచ్చే జనవరి 1న థియేటర్స్ లో ఘనంగా విడుదలవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి నీ పసుపు పాదాలే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

నీ పసుపు పాదాలే పాటకు శాండిల్య పీసపాటి బ్యూటిఫుల్ ట్యూన్ కంపోజ్ చేసి కీర్తనతో కలిసి పాడారు. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు. నీ పసుపు పాదాలే తగిలి గడప పూసెనా.నీ ఎరుపు సిగ్గుల్లో ఎలిగి మెరిసెనాకంచు మట్టె సప్పుల్లో ఇళ్లే కళ్లు తెరిసి సూసెనా.అంటూ నవ వధువు అత్తింట్లో అడుగుపెట్టిన సంతోషకరమైన సందర్భంలో సాగుతుందీ పాట. కథలో భాగంగా ఈ పాటను పిక్చరైజ్ చేసినట్లు తెలుస్తోంది.

నటీనటులు :

ఆకాష్, భావన, తనికెళ్ల భరణి, రమ్య పొందూరి, సత్య సాయి శ్రీనివాస్ తదితరులు

టెక్నికల్ టీమ్ :

నిర్మాత : కె రాఘవేంద్ర రావు
సినిమాటోగ్రఫీ, రచన, దర్శకత్వం : గంగనమోని శేఖర్
సంగీతం : సురేష్ బొబ్బిలి
ఎడిటర్ : రాఘవేంద్ర వర్మ