గేమ్ ఓవర్ చిత్రం ప్రారంభం

Published On: October 11, 2018   |   Posted By:

గేమ్ ఓవర్ చిత్రం ప్రారంభం

తాప్సి’ కథానాయికగా ‘గేమ్ ఓవర్’ ప్రారంభం

ప్రముఖ కథానాయిక ‘తాప్సి’ ప్రధాన పాత్రలో ‘గేమ్ ఓవర్’ పేరుతో  ప్రముఖ తెలుగు,తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ ‘వై నాట్ స్థూడియోస్’ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది.

గతంలో ఈ సంస్థ సిద్ధార్ధ్’ కథానాయకునిగా రూపొందిన ‘లవ్ ఫెయిల్యూర్’ (2012), విక్టరీ ‘వెంకటేష్’ కథానాయకునిగా రూపొందిన ‘గురు’ (2017) వంటి ఘన విజయం సాధించిన చిత్రాలను నిర్మించిన విషయం విదితమే. ఇప్పుడు తమ మరో ప్రయత్నం గా తాప్సి’ ప్రధాన పాత్రలో  ఈ ‘గేమ్ ఓవర్’ ను నిర్మించటాన్ని సంతోషంగా ప్రకటించింది.

‘నయనతార’ కథానాయికగా తమిళ నాట ఘనవిజయం సాధించిన ‘మయూరి’ వంటి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ‘అశ్విన్ శరవణన్’ దర్శకత్వంలో ఈ ‘గేమ్ ఓవర్’  చిత్రాన్ని అభిరుచి కలిగిన నిర్మాత వై నాట్ స్థూడియోస్’ అధినేత ఎస్.శశికాంత్ నిర్మిస్తున్నారు.

ఈ ‘గేమ్ ఓవర్’ చిత్రం చెన్నై లో నేడు (అక్టోబర్ పదకొండు) ప్రారంభమయింది. ఓ సరికొత్త కధ, కథనాలతో తెలుగు,తమిళ భాషలలో ఏక కాలంలో నేటి నుంచి ఏక ధాటిగా ఆంద్ర,తెలంగాణ,తమిళనాడు రాష్ట్రాలలోని పలు ప్రదేశాలలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది అని నిర్మాత ఎస్.శశికాంత్ తెలిపారు. ‘లవ్ ఫెయిల్యూర్’, ‘గురు’, విజయాల సరసన ఈ చిత్రం కూడా నిలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఈ ‘గేమ్ ఓవర్’ చిత్రానికి సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్ , ఎడిటర్: రిచర్డ్ కెవిన్, రచన: అశ్విన్ శరవణన్,కావ్య రాంకుమార్, మాటలు: వెంకట్ కాచర్ల, ఛాయా గ్రహణం: ఎ.వసంత్, ఆర్ట్: శివకుమార్, పోరాటాలు: ‘రియల్’ సతీష్దర్శకత్వం: అశ్విన్ శరవణన్. , నిర్మాత: ఎస్.శశికాంత్