నరసింహ నంది కొత్త చిత్రo

Published On: October 1, 2020   |   Posted By:

నరసింహ నంది కొత్త చిత్రo

ఆస్కార్ అవార్డ్  లో నిలవాలి అనే  టార్గెట్ గా కరోనా లాక్ డౌన్ లో ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల్లో  తీసుకునే నిర్ణయాలు వల్ల  ఒక ప్రేమ జంట జీవితం ఎలా చిన్నాభిన్నం ఐనది అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు నరసింహ నంది అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతు.. 2011లో ‘1940 లో ఒక గ్రామం’ అనే చిత్రానికి జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డ్ మరియు 3 నంది అవార్డ్ వచ్చాయి. 2013లో ‘కమలతో నా ప్రయాణం’ చిత్రానికి నంది అవార్డ్ వచ్చింది. 2016  లజ్జా సినిమాను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి పంపడం జరిగింది. ఇటీవలే యూత్ కోసం ‘డిగ్రీ కాలేజ్’ అనే సినిమా తీసాను’ అన్నారు.

ఈ కొత్త చిత్రానికి DOP మురళి మోహన్ రెడ్డి. సంగీతం సుకుమార్. ఎడిటర్.నాగిరెడ్డి మొ.. వారు సాంకేతికంగా పనిచేస్తున్నారు. అందరూ కొత్త నటీనటులను పరిశీలిస్తున్నాం. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించే ఈ చిత్రం పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం అన్నారు దర్శకుడు నరసింహ నంది.