మహదేవపురంలో ఏం జరిగింది? చిత్రం ఊర్వశి ఓటిటి ద్వారా విడుదల

Published On: February 17, 2021   |   Posted By:

మహదేవపురంలో ఏం జరిగింది? చిత్రం ఊర్వశి ఓటిటి ద్వారా విడుదల

ఇంతకుముందు మెగా బ్రదర్ నాగబాబు-రమ్యకృష్ణ జంటగా ‘అంజనీపుత్రుడు’ చిత్రాన్ని రూపొందించిన బహుముఖ ప్రతిభాశాలి కె.చంద్రశేఖర్ తాజాగా స్వీయ నిర్మాణం-రచన- దర్శకత్వంలో తనే హీరోగా నటిస్తూ లక్కీ ఆర్ట్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘మహదేవపురం’. గ్రాఫిక్స్ కి ప్రాధాన్యమిస్తూ  సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి కె.వి.సూర్యనారాయణ సహ నిర్మాత.     

ప్రీతి సింగ్, ప్రమీల, అర్జునరాజు, సూర్యనారాయణ, బ్రహ్మం ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రం “ఊర్వశి ఓటిటి” ద్వారా విడుదల కానుంది.     

హీరో-రైటర్-ప్రొడ్యూసర్-డైరెక్టర్ కె.చంద్రశేఖర్ మాట్లాడుతూ… “కథ, స్క్రీన్ ప్లే, పాటలు, పోరాటాలు, నేపధ్య సంగీతం, గ్రాఫిక్స్ “మహదేవపురం” చిత్రానికి ముఖ్య ఆకర్షణలు” అని అన్నారు.     

ఈ చిత్రానికి ఫైట్స్: రవి, కెమెరా: గోపి, ఎడిటింగ్: మేనగ శ్రీను-ఉదయ్ కుమార్, పాటలు: రాందాసు టంగుటూరి, సంగీతం: మహేష్ నారాయణ, సహ నిర్మాత: కె.వి.సూర్యనారాయణ, హీరో-రైటర్- ప్రొడ్యూసర్-డైరెక్టర్: కె.చంద్రశేఖర్!!