మొక్కలు నాటిన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్

Published On: September 16, 2020   |   Posted By:
మొక్కలు నాటిన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్
 
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్
 
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన మూడో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా అద్భుతం గా కొనసాగుతుంది దీనిలో పాల్గొని మొక్కలు నాటడానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. 
 
బాహుబలి ప్రభాస్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈరోజు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ బొంబాయి లోని తన నివాసంలో మొక్కలు నాటి ఈ విషయాన్ని తన సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ ద్వారా తెలియజేయడం జరిగింది. 
ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాది.