వీధి బాలలం ఆడియో లాంచ్‌

Published On: November 12, 2019   |   Posted By:
 వీధి బాలలం  ఆడియో లాంచ్‌
  
 ఎ .వి  వర్మరాజు  సమర్పణలో వాహిని క్రియేషన్స్‌ పతాకంపై శ్రీ తారక్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బాలల  చిత్రం ‘వీధిబాలలం’. మాకూ స్వాతంత్య్రం కావాలి అనేది ట్యాగ్‌లైన్‌. సుమారు 1200 మంది పిల్లలను  వివిధ స్కూల్స్‌ నుండి ఎంపిక చేసి వాళ్లకు నటనలో మెళకువలు  నేర్పించి ‘వీధి బాలలం’ చిత్రాన్ని తెరకెక్కించారు.
 
 
ఈ చిత్ర ఆడియో ఇటీవల  సిరిపురం వుడా చిల్డ్రన్స్  థియేటర్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం టూరిజం శాఖ మంత్రివర్యులు  అవంతి శ్రీనివాసరావు చేతుల  మీదుగా జరిగింది. ఈ సందర్భంగా టూరిజం శాఖ మంత్రివర్యులు  అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ..‘‘సమాజానికి సందేశమిచ్చే ఇటువంటి సినిమాలు  మరెన్నో రావాలనీ, వీధిబాలపై ఇటువంటి కథాంశంతో సినిమా చేసిన దర్శక నిర్మాతలను అభినందిస్తున్నాను. ఈ సినిమా విడుద విషయంలో నా వంతు సాయం చేస్తా’’ అన్నారు.
నిర్మాత ఏ. వి వర్మరాజు మాట్లాడుతూ..‘‘ఈ సినిమా మీద వచ్చిన   ప్రతి పైసా అనాథ పిల్లల సహాయార్ధం ఉపయోగిస్తాం’’ అన్నారు.
 
 
దర్శకుడు శ్రీ తారక్‌ మాట్లాడుతూ…‘‘సమాజంలోని ప్రతి ఒ్కకరినీ ఆలోచింపజేసే విధంగా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు.
 
నటుడు తనీష్‌ మాట్లాడుతూ..‘‘నేను కూడా బాల  నటుడుగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యాను.  ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలన్నారు.
 
ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్‌పి ఎమ్‌.వి.వి సత్యనారాయణ, పాటల  రచయిత దుర్గాప్రసాద్‌, విజయవాణి, ఎఫ్‌ఎమ్‌ బాబాయి తదితరులు  పాల్గొన్నారు